4. క ఏషముక్తాధరహాస దీధితి ర్విరాజమానఃపురుషః పురో మమ |
తమాలవృక్ష స్స్పుట పల్లవాన్తర ప్రకమ్పిచణ్డంశు రివాపరస్థితః ?
పెదవుల మధ్య ప్రసరించు చిరునవ్వు కాంతులతో, చిగురుటాకుల మధ్య నుండి చలించుచున్న సూర్యకాంతులతో గూడిన, అపర తమాల వృక్షమువలె, నా ఎదురుగ ప్రకాశించుచున్నట్టి యీ పురుషుడెవ్వరు?
5. పాణిపాదాక్షిభిస్తామ్రై ర్నీలఃకోஉయం మహోదధౌ
జలజైర్జల సజ్ఘాత ఇవసఙ్గతః ?
ఎర్రని-పాదములు, చేతులు, కన్నులతో సముద్రములో నొక నీల వర్ణము గల పురుషుడు, ఎర్రని పద్మములు అచటనచట నున్నట్టి నీలమైన ఒక నాచు దిబ్బవలె శయనించియునాడు ఎవరతడు ?
6. పిఞ్ఛేన నీలకణ్ఠస్య మకుటోపరిశోభినా
కణ్ఠే చ తులసీహారః కమనీయః క ఏష భోః ?
కిరీటము కొనపై శోభించు నెమలి పింఛముతో, మెడలో తులసీ మాలతో, కమనీయుడైన ఇతడెవరు? బిగ్గరగ నడుగుచున్నాను.
Saturday, October 18, 2008
Saturday, June 7, 2008
ప్రథమ దళమ్ (1-3)
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ కృష్ణ భాగవతమ్
శ్రీ కృష్ణ భాగవతమ్
ప్రథమ దళమ్
1. పిఞ్ఛావతంసః పురుషోஉవతీర్ణ స్సువర్ణవర్ణామ్బర భాసమానః
కణ్ఠే చ దామ్నా తులసీదళానా మాలిఙ్గ్యమముత్తరళీ కరోతి
నెమలిపింఛమునలంకారముగ కలవాడును,బంగారు పీతాంబరముతో ప్రకాశించువాడును, కంఠమున తులసీమాలతో నున్న నొకానొక పురుషుదు దిగివచ్చి నన్ను కౌగలించుకొని నాకు గగుర్పాటును కలుగజేయుచున్నాడు.
2. హేమ క్షౌమ ధరోగళేచ తులసీహరః కరే వేణునా
ముగ్ధాఙ్గైవనీత మార్దవ భరై రాముక్త ముక్తా సరైః
ఆలిఙ్గన్న హమస్మిమాశుచ ఇతి ప్రేమాబ్ధి కల్లోలవ
త్కోஉయంశ్యామయునా ప్రతిక్షణమపి ప్రత్యక్ష మభాషతే?
బంగారు పట్టుధోవతి ధరించి, కంఠమున తులసీమాలతో, చేతిలో వేణువుతో, ముత్యముల మాలలతో గూడిన వెన్న యొక్క మృదుత్వముతో నిండి ముగ్ధమైన అవయవములతో, నన్ను ప్రతిక్షణము కౌగలించుకొని "నేనున్నాను బాధపడవద్దు" అని చెప్పుచు ప్రేమ సముద్రము మహాతరంగమువలె వచ్చుచున్న శ్యామయువకుడెవరు?
3. ఆగత్య పాదధ్వని కిజ్కిణీషు ముక్తావళీ భూషణ ఘోషణాసు
మాంవాదయంన్వేణు మివాన్యరూపం నిత్యం సమాలిఙ్గతి కోనునీలః?
పాదముల గజ్జెలు మ్రోగుచుండ, ముత్యముల హారములు మెల్లగ ధ్వనించుచుండ, తన వేణువుయొక్క మరొక రూపమైన నన్ను వాయించుచు, నిత్యము నన్నొక నీల వర్ణముగల పురుషుడు కౌగలించు కొనుచున్నాడు. ఎవరతడు?
కణ్ఠే చ దామ్నా తులసీదళానా మాలిఙ్గ్యమముత్తరళీ కరోతి
నెమలిపింఛమునలంకారముగ కలవాడును,బంగారు పీతాంబరముతో ప్రకాశించువాడును, కంఠమున తులసీమాలతో నున్న నొకానొక పురుషుదు దిగివచ్చి నన్ను కౌగలించుకొని నాకు గగుర్పాటును కలుగజేయుచున్నాడు.
2. హేమ క్షౌమ ధరోగళేచ తులసీహరః కరే వేణునా
ముగ్ధాఙ్గైవనీత మార్దవ భరై రాముక్త ముక్తా సరైః
ఆలిఙ్గన్న హమస్మిమాశుచ ఇతి ప్రేమాబ్ధి కల్లోలవ
త్కోஉయంశ్యామయునా ప్రతిక్షణమపి ప్రత్యక్ష మభాషతే?
బంగారు పట్టుధోవతి ధరించి, కంఠమున తులసీమాలతో, చేతిలో వేణువుతో, ముత్యముల మాలలతో గూడిన వెన్న యొక్క మృదుత్వముతో నిండి ముగ్ధమైన అవయవములతో, నన్ను ప్రతిక్షణము కౌగలించుకొని "నేనున్నాను బాధపడవద్దు" అని చెప్పుచు ప్రేమ సముద్రము మహాతరంగమువలె వచ్చుచున్న శ్యామయువకుడెవరు?
3. ఆగత్య పాదధ్వని కిజ్కిణీషు ముక్తావళీ భూషణ ఘోషణాసు
మాంవాదయంన్వేణు మివాన్యరూపం నిత్యం సమాలిఙ్గతి కోనునీలః?
పాదముల గజ్జెలు మ్రోగుచుండ, ముత్యముల హారములు మెల్లగ ధ్వనించుచుండ, తన వేణువుయొక్క మరొక రూపమైన నన్ను వాయించుచు, నిత్యము నన్నొక నీల వర్ణముగల పురుషుడు కౌగలించు కొనుచున్నాడు. ఎవరతడు?
Saturday, May 3, 2008
ఆముఖమ్ - 2
శ్లో|| త్రిమూర్త్యాత్మావతారోஉయం
నైకమూర్తేర్దశాஉకృతౌ
గణ్యతె కృష్ణరూపోஉయం
దత్తః పూర్ణతమాకృతిః
తా|| శ్రీకృష్ణుడు త్రిమూర్తుల ఆత్మయగు శ్రీ దత్తుని అవతారము. అందువలన, త్రిమూర్తులలో ఒక మూర్తియగు విష్ణువు యొక్క దశావతారములలో యీ కృష్ణావతారము చెప్పబడుటలేదు. ఇది త్రిమూర్త్యాత్మక మూల పర బ్రహ్మయగు శ్రీ దత్తుని పరిపూర్ణ తమావతారము.(పరిపూర్ణతమస్సాక్షాత్, శ్రీ కృష్ణోనాన్య ఏవహి అని శాస్త్రోక్తి).
శ్లో|| నవనీతప్రియః కృష్ణః, క్షీరం దత్తప్రియం తతః
నవనీతం పయోజాతం, కృష్ణోదత్తా త్సమాగతః
తా|| వెన్న కృష్ణునకు ఇష్టమైనది. పాలు దత్తునకు ఇష్టమైనవి. పాలనుండి వెన్న సంభవించినట్లు దత్తుని నుండి శ్రీ కృష్ణుడు అవతరించినాడు. శ్రీ దత్త భగవనుడు సదా బ్రహ్మజ్ఞానమును బోధించుట చేత గురురాజుగా ఉన్నాడు. శ్రీ కృష్ణుడును గీతాబోధ చేత గురురాజుగా వెలసినాడు. ఇంత ఏల? - శ్రీ కృష్ణుని విశ్వరూపములో మధ్యస్ధానమున బ్రహ్మ-విష్ణు-శివ ముఖములతో యోగీశ్వరుడగు శ్రీ దత్త భగవానుడే నిలచి దర్శనమిచ్చెను.
శ్లో|| రాజేశ్వర సమార్ధత్వా, ద్యోగిరాజోஉయ మీశ్వరః
సర్వదేవాస్యనేపధ్య - మధ్యే షష్టీహి కారణే.
తా|| రాజ = ఈశ్వర శబ్దాలు పర్యాయ పదములు. యోగీశ్వరుడనగా యోగిరాజు అగు శ్రీ దత్తుడే. విశ్వరూపములో మధ్యలో త్రిముఖుడగు శ్రీ దత్తభగవానుడు నిలచియుండగా, ఆయనయొక్క సర్వవేషములగు సర్వదేవతల ముఖములును, ఇరుప్రక్కల ఉన్నవి. శ్రీ కృష్ణుడు అర్జునునితో "పశ్య ! మే యోగమైశ్వరమ్" అన్నాడు. అనగా "నా యోగీశ్వర స్వరూపమును చూడుము" అని అర్ధము. ఇచట "నా" అను షష్టీ విభక్తి, తన కృష్ణావతారమునకు మూలకారణమగు యోగిరాజు అగు దత్తుని చెప్పుచున్నది. "హేతౌషష్ఠీ" అని కదా!
శ్లో|| త్రిముఖైర్బ్రహ్మ నిశ్చిత్య, ముఖకర్మణి సంశయమ్
ఛేత్తుం పురాణ సిద్ధంచ, విశ్వరూప ప్రదర్శనమ్
తా|| త్రిమూర్తుల మూడు ముఖములచేత తానే పరబ్రహ్మమని నిశ్చయించబడిన శ్రీ దత్త భగవానుడు కృష్ణావతారమున విశ్వరూప ప్రదర్శనమును చేయుటకు కారణమేమనగా - అసలు ఆ త్రిమూర్తులు సృష్టి, స్ధితి, లయములు చేయుచున్నారని పురాణములలో చెప్పబడిననూ దానికి ప్రత్యక్ష ప్రమాణమేమిటి? శ్రీ దత్తుడే త్రిమూర్త్యాత్మకుడగుటకు ప్రత్యక్ష ప్రమాణమగు ఆయన స్వరూపమున్నది గదా. అట్లే త్రిమూర్తుల అధికారములకు ప్రత్యక్షమేమిటి ? అను సంశయము రాగా, దానిని నివారించుటకై కృష్ణావతారమును ఎత్తినాడు.
శ్లో|| సాధర్మ దేవతా ధేను, రనుయాతా స్వరక్షణే
అధర్మవ్యాఘ్ర భీతేయం, శ్రీ దత్తం కృష్ణ రూపిణమ్
తా|| ధేను రూపంలో ఉన్న ఆ ధర్మదేవత, కృష్ణ రూపమును ధరించిన శ్రీ దత్తుని అనుసరించి వెనుక నిలబడియున్నది. ఈ ధర్మదేవతా ధేనువు, అధర్మమను పులికి భయపడి, తన రక్షణ నిమిత్తము స్వామిని విడనాడకయున్నది.
నైకమూర్తేర్దశాஉకృతౌ
గణ్యతె కృష్ణరూపోஉయం
దత్తః పూర్ణతమాకృతిః
తా|| శ్రీకృష్ణుడు త్రిమూర్తుల ఆత్మయగు శ్రీ దత్తుని అవతారము. అందువలన, త్రిమూర్తులలో ఒక మూర్తియగు విష్ణువు యొక్క దశావతారములలో యీ కృష్ణావతారము చెప్పబడుటలేదు. ఇది త్రిమూర్త్యాత్మక మూల పర బ్రహ్మయగు శ్రీ దత్తుని పరిపూర్ణ తమావతారము.(పరిపూర్ణతమస్సాక్షాత్, శ్రీ కృష్ణోనాన్య ఏవహి అని శాస్త్రోక్తి).
శ్లో|| నవనీతప్రియః కృష్ణః, క్షీరం దత్తప్రియం తతః
నవనీతం పయోజాతం, కృష్ణోదత్తా త్సమాగతః
తా|| వెన్న కృష్ణునకు ఇష్టమైనది. పాలు దత్తునకు ఇష్టమైనవి. పాలనుండి వెన్న సంభవించినట్లు దత్తుని నుండి శ్రీ కృష్ణుడు అవతరించినాడు. శ్రీ దత్త భగవనుడు సదా బ్రహ్మజ్ఞానమును బోధించుట చేత గురురాజుగా ఉన్నాడు. శ్రీ కృష్ణుడును గీతాబోధ చేత గురురాజుగా వెలసినాడు. ఇంత ఏల? - శ్రీ కృష్ణుని విశ్వరూపములో మధ్యస్ధానమున బ్రహ్మ-విష్ణు-శివ ముఖములతో యోగీశ్వరుడగు శ్రీ దత్త భగవానుడే నిలచి దర్శనమిచ్చెను.
శ్లో|| రాజేశ్వర సమార్ధత్వా, ద్యోగిరాజోஉయ మీశ్వరః
సర్వదేవాస్యనేపధ్య - మధ్యే షష్టీహి కారణే.
తా|| రాజ = ఈశ్వర శబ్దాలు పర్యాయ పదములు. యోగీశ్వరుడనగా యోగిరాజు అగు శ్రీ దత్తుడే. విశ్వరూపములో మధ్యలో త్రిముఖుడగు శ్రీ దత్తభగవానుడు నిలచియుండగా, ఆయనయొక్క సర్వవేషములగు సర్వదేవతల ముఖములును, ఇరుప్రక్కల ఉన్నవి. శ్రీ కృష్ణుడు అర్జునునితో "పశ్య ! మే యోగమైశ్వరమ్" అన్నాడు. అనగా "నా యోగీశ్వర స్వరూపమును చూడుము" అని అర్ధము. ఇచట "నా" అను షష్టీ విభక్తి, తన కృష్ణావతారమునకు మూలకారణమగు యోగిరాజు అగు దత్తుని చెప్పుచున్నది. "హేతౌషష్ఠీ" అని కదా!
శ్లో|| త్రిముఖైర్బ్రహ్మ నిశ్చిత్య, ముఖకర్మణి సంశయమ్
ఛేత్తుం పురాణ సిద్ధంచ, విశ్వరూప ప్రదర్శనమ్
తా|| త్రిమూర్తుల మూడు ముఖములచేత తానే పరబ్రహ్మమని నిశ్చయించబడిన శ్రీ దత్త భగవానుడు కృష్ణావతారమున విశ్వరూప ప్రదర్శనమును చేయుటకు కారణమేమనగా - అసలు ఆ త్రిమూర్తులు సృష్టి, స్ధితి, లయములు చేయుచున్నారని పురాణములలో చెప్పబడిననూ దానికి ప్రత్యక్ష ప్రమాణమేమిటి? శ్రీ దత్తుడే త్రిమూర్త్యాత్మకుడగుటకు ప్రత్యక్ష ప్రమాణమగు ఆయన స్వరూపమున్నది గదా. అట్లే త్రిమూర్తుల అధికారములకు ప్రత్యక్షమేమిటి ? అను సంశయము రాగా, దానిని నివారించుటకై కృష్ణావతారమును ఎత్తినాడు.
శ్లో|| సాధర్మ దేవతా ధేను, రనుయాతా స్వరక్షణే
అధర్మవ్యాఘ్ర భీతేయం, శ్రీ దత్తం కృష్ణ రూపిణమ్
తా|| ధేను రూపంలో ఉన్న ఆ ధర్మదేవత, కృష్ణ రూపమును ధరించిన శ్రీ దత్తుని అనుసరించి వెనుక నిలబడియున్నది. ఈ ధర్మదేవతా ధేనువు, అధర్మమను పులికి భయపడి, తన రక్షణ నిమిత్తము స్వామిని విడనాడకయున్నది.
Friday, April 25, 2008
ఆముఖమ్ -1
శ్లో || బ్రహ్మోపేన్ద్ర శివాననై స్త్రి జగతాం సృష్టి స్ధితి ధ్వంసకృ
ద్దత్తో బ్రహ్మస ఏక ఏవ నిగమేహేతుద్వయాన్నిశ్చితమ్
విశ్వోత్పత్తి భృతిక్షయాన్విహితవా న్యో విశ్వరూపః పరం
కృష్ణః పూర్ణతమావతార ఉదిత స్తత్కర్మ సన్దర్శయన్.
తా|| బ్రహ్మ-విష్ణు-శివ ముఖములతో త్రిలోకములను, సృష్టించి పాలించి లయింపచేయువాడును, ఒకే ఒకడుగ శ్రీ దత్తుడే బ్రహ్మమని వేదములో చెప్పబడిన బ్రహ్మము యొక్క నిర్వచనములోని రెండు అంశములను పరిపూర్ణ సమన్వయమైనందు నిశ్చయించబడినది. "యతోవా..." "ఏకమేవ.." అని రెండు లక్షణములు బ్రహ్మమునకు చెప్పబడినవి. అయితే యీ మూడు త్రిమూర్తుల ముఖములు విశ్వమును సృష్టించి, పాలించి, లయింపచేయుటయను మూడు పనులను ప్రత్యక్షముగా చూపించుటకై, శ్రీ దత్తుడు పూర్ణతమమైన శ్రీ కృష్ణావతారమునెత్తి, మధ్య మూడు ముఖములలో యోగిరాజు అను శ్రీ దత్తుని మూలరూపములో నిలచి, విశ్వమును సృష్టించి కొంతసేపు ధరించి చివరకు తనలో ఉపసంహరించికొని యీ త్రిమూర్తులే ఆ మూడు పనులను చేయుచున్నారనియు, ఆ త్రిమూర్తులే తానొక్కడే ననియు నిరూపించినాడు.
శ్లో|| దత్తావధూత స్సంవాదీ, యదోర్వంశేஉవ రీర్ణవాన్
పితృశాపాస్త రాజత్వం, దాతుం కృష్ణ ఇతిశ్రితః.
తా|| అవధూతయదు సంవాదానంతరము, శ్రీ దత్తాత్రేయ భగవానుడు ఆ అవధూత, తండ్రియగు యయాతి శాపము చేత అస్తమించిన రాజ్యాధికారమును మరల యదువంశమునకు ప్రసాదించుటకై కృష్ణుడను పేరుతో పిలువబడుచు,యదువంశమునందు అవతరించెను.
శ్లో|| జారత్వ చోరత్వ గుణాది మాయా
సిద్దిప్రకాశో ముహురాత్మ యోగాత్
గీతార్ధ బోధా ద్గురు రాజ భావో
యోగీశ్వరోஉదృశ్యత విశ్వరూపే.
తా|| శ్రీ దత్త భగవానుని లక్షణములన్నియును శ్రీ కృష్ణావతారమున స్పష్టముగ గో్చరించినవి. శ్రీ దత్తుడు మద్యపాన-వేశ్యాలోలత్వము మొ|| దుర్గుణమాయచే కప్పబడియుండును. శ్రీ కృష్ణుడును అట్లే దొంగతనము, వ్యభిచారము మొ|| దుర్గుణమాయచే కప్పబడియుండును. (దీనివలన అజ్ఞానులు తనను చేరరు). ఆత్మయోగముచేత మాటి మాటికిని అష్టసిద్దులు (మహిమలు) ఇద్దరిలోను వ్యక్తమగుట సమానమే.
శ్లో|| చత్వారశ్శునకాః ఖరస్వరగళా జీవాఃపదాలమ్బిన
స్సేవా పుణ్యఫలాత్కఠోర నిగమాస్తే స్వామినాహ్యుద్దృతాః
ఆస్యేరన్ద్ర చ్తుష్టయేన మురళీ రూపేణచైకీకృతా
స్సన్నాదైర్మధురామృత స్రవరసైస్తత్సేవయా తత్ఫలమ్.
తా|| నాలుగు కఠోర నిష్టాపరవేదములు, పరుషస్వర కంఠములు కలవియై జీవ భావంతో వేదపురుషులు స్వామి పాదముల వద్ద వ్రేలాడుచూ, సేవచేసిన పుణ్యఫలము వలన శ్రీ దత్తస్వామిచే పాదముల నుండి ఉద్దరింపబడి ముఖ స్ధానమున ఉంచబడినారు. మరియు నాల్గు వేదములు నాల్గు రంధ్రములతో గల మురళిగా ఐక్యము చెంది ఒకే వేదముగా మారినారు. వారి పరుష స్వరమైన కర్మ మార్గము, మధురామృత స్రవరసమయములగు మంచి నాదములతో భక్తిగా మారినది. ఆయన సేవకు అదీ ఫలితము.
శ్లో|| కఠోర నిష్ఠా యజ్ఞాది - కర్మవేద శ్శ్వరూపవన్
ఉద్దృతో మధురాభక్తిః వేణుస్సంసూచితో యతః
తా|| కఠోర నిష్టలతో కూడిన యజ్ఞాచరణమయమైన, శునక రూపముననున్న వేదము, ఉద్దరింపబడి, మధురభక్తి రూపమైన వేణువుగా మారినదని దీనిచేత సూచింపబడినది.
ద్దత్తో బ్రహ్మస ఏక ఏవ నిగమేహేతుద్వయాన్నిశ్చితమ్
విశ్వోత్పత్తి భృతిక్షయాన్విహితవా న్యో విశ్వరూపః పరం
కృష్ణః పూర్ణతమావతార ఉదిత స్తత్కర్మ సన్దర్శయన్.
తా|| బ్రహ్మ-విష్ణు-శివ ముఖములతో త్రిలోకములను, సృష్టించి పాలించి లయింపచేయువాడును, ఒకే ఒకడుగ శ్రీ దత్తుడే బ్రహ్మమని వేదములో చెప్పబడిన బ్రహ్మము యొక్క నిర్వచనములోని రెండు అంశములను పరిపూర్ణ సమన్వయమైనందు నిశ్చయించబడినది. "యతోవా..." "ఏకమేవ.." అని రెండు లక్షణములు బ్రహ్మమునకు చెప్పబడినవి. అయితే యీ మూడు త్రిమూర్తుల ముఖములు విశ్వమును సృష్టించి, పాలించి, లయింపచేయుటయను మూడు పనులను ప్రత్యక్షముగా చూపించుటకై, శ్రీ దత్తుడు పూర్ణతమమైన శ్రీ కృష్ణావతారమునెత్తి, మధ్య మూడు ముఖములలో యోగిరాజు అను శ్రీ దత్తుని మూలరూపములో నిలచి, విశ్వమును సృష్టించి కొంతసేపు ధరించి చివరకు తనలో ఉపసంహరించికొని యీ త్రిమూర్తులే ఆ మూడు పనులను చేయుచున్నారనియు, ఆ త్రిమూర్తులే తానొక్కడే ననియు నిరూపించినాడు.
శ్లో|| దత్తావధూత స్సంవాదీ, యదోర్వంశేஉవ రీర్ణవాన్
పితృశాపాస్త రాజత్వం, దాతుం కృష్ణ ఇతిశ్రితః.
తా|| అవధూతయదు సంవాదానంతరము, శ్రీ దత్తాత్రేయ భగవానుడు ఆ అవధూత, తండ్రియగు యయాతి శాపము చేత అస్తమించిన రాజ్యాధికారమును మరల యదువంశమునకు ప్రసాదించుటకై కృష్ణుడను పేరుతో పిలువబడుచు,యదువంశమునందు అవతరించెను.
శ్లో|| జారత్వ చోరత్వ గుణాది మాయా
సిద్దిప్రకాశో ముహురాత్మ యోగాత్
గీతార్ధ బోధా ద్గురు రాజ భావో
యోగీశ్వరోஉదృశ్యత విశ్వరూపే.
తా|| శ్రీ దత్త భగవానుని లక్షణములన్నియును శ్రీ కృష్ణావతారమున స్పష్టముగ గో్చరించినవి. శ్రీ దత్తుడు మద్యపాన-వేశ్యాలోలత్వము మొ|| దుర్గుణమాయచే కప్పబడియుండును. శ్రీ కృష్ణుడును అట్లే దొంగతనము, వ్యభిచారము మొ|| దుర్గుణమాయచే కప్పబడియుండును. (దీనివలన అజ్ఞానులు తనను చేరరు). ఆత్మయోగముచేత మాటి మాటికిని అష్టసిద్దులు (మహిమలు) ఇద్దరిలోను వ్యక్తమగుట సమానమే.
శ్లో|| చత్వారశ్శునకాః ఖరస్వరగళా జీవాఃపదాలమ్బిన
స్సేవా పుణ్యఫలాత్కఠోర నిగమాస్తే స్వామినాహ్యుద్దృతాః
ఆస్యేరన్ద్ర చ్తుష్టయేన మురళీ రూపేణచైకీకృతా
స్సన్నాదైర్మధురామృత స్రవరసైస్తత్సేవయా తత్ఫలమ్.
తా|| నాలుగు కఠోర నిష్టాపరవేదములు, పరుషస్వర కంఠములు కలవియై జీవ భావంతో వేదపురుషులు స్వామి పాదముల వద్ద వ్రేలాడుచూ, సేవచేసిన పుణ్యఫలము వలన శ్రీ దత్తస్వామిచే పాదముల నుండి ఉద్దరింపబడి ముఖ స్ధానమున ఉంచబడినారు. మరియు నాల్గు వేదములు నాల్గు రంధ్రములతో గల మురళిగా ఐక్యము చెంది ఒకే వేదముగా మారినారు. వారి పరుష స్వరమైన కర్మ మార్గము, మధురామృత స్రవరసమయములగు మంచి నాదములతో భక్తిగా మారినది. ఆయన సేవకు అదీ ఫలితము.
శ్లో|| కఠోర నిష్ఠా యజ్ఞాది - కర్మవేద శ్శ్వరూపవన్
ఉద్దృతో మధురాభక్తిః వేణుస్సంసూచితో యతః
తా|| కఠోర నిష్టలతో కూడిన యజ్ఞాచరణమయమైన, శునక రూపముననున్న వేదము, ఉద్దరింపబడి, మధురభక్తి రూపమైన వేణువుగా మారినదని దీనిచేత సూచింపబడినది.
Subscribe to:
Comments (Atom)